YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కర్నూలులో ప్రేమోన్మాది టీచర్

కర్నూలులో ప్రేమోన్మాది టీచర్

తనను ప్రేమించలేదన్న అక్కసుతో కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై టీచర్ శంకర్ కత్తితో దాడిచేశాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రాణాలు దక్కించుకోగా, శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. బాలికపై దాడికి పాల్పడిన హిందీ పండిట్ శంకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారుపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే, పెడదోవ పట్టాడు. ప్రేమ పేరుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించి, ఇందుకు అమె అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. శనివారం ఉదయం బాలిక ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయుడు ఆమె గొంతుకోశాడు. దారుణమైన ఈ ఘటన కర్నూలు నగరంలోని బంగారుపేటలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న శంకర్‌ ఈ దాడికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం బాలిక ఇంట్లోకి వెళ్లి గొంతుకోసిన అనంతరం, నిందితుడు అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఉపాధ్యాయుడు ఇంట్లోకి ప్రవేశించి, దాడికి పాల్పడటంతో బాలిక పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని శంకర్‌ను పట్టుకున్నారు. తర్వాత అతడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. మద్యం మత్తులో నిందితుడు‌ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో శంకర్ వేధిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. దీనికి బాలిక అంగీకరించకపోవడంతో గొంతుకోసి హత్యచేయడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థిని చదువుతుండగా అక్కడే హిందీ టీచర్ గా పనిచేస్తున్న శంకర్ ఆమెపై కన్నేశాడు. తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు అంగీకరించని బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు శంకర్ ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని ఆ ప్రబుద్ధుడు యువతి వెంటపడటం మానలేదు. ఆమెపై మరింత కక్షను పెంచుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై నిందితుడు దాడిచేసినట్టు స్థానికులు తెలియజేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. నిందితుడు శంకర్‌ను విధుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించారు. 
 

Related Posts