YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మీ కంటితుడుపు చర్యలు ఆపండి

మీ కంటితుడుపు చర్యలు ఆపండి

- ట్విట్టర్‌లో వైయస్‌ జగన్‌

 ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కావలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ తాజా రాజకీయ పరిణామాలపై ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. విభజన చేసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. పార్లమెంట్‌ వేదికగా అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయి. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. హోదా అమలు అంశాన్ని ప్రణాళిక సంఘానికి కూడా పంపారు. హోదా వల్ల ఏపీకి అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఏ నైతిక విలువలతో చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టారు. ఏమిస్తారో తెలియని ప్రత్యేక ప్యాకేజీ కోసం హోదాను తాకట్టుపెడతారా? అని వైయస్‌ జగన్‌ చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు. మీ కంటితుడుపు చర్యలు ఆపండి. మీరు చేసిందేంటో ఏపీ ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

Related Posts