
చిత్తూరు
సుపరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాలా తీసినా.., సి.యం.చంద్రబాబు అపార అనుభవం.., పాలనా దక్షతతో తల్లికి వందనం పథకం అమలయ్యిందనీ.., కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని.., ఫలితంగా సర్వత్రా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అందుకనే మాది పనిచేసే ప్రభుత్వమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ఉద్ఘాటించారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.. మంగళవారం ఓ ప్రకటనలో స్పందించారు. వేసవి సెలవులు ముగిసిన తక్షణం.., రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చెప్పినట్టుగానే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారో.. వారందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసి.,జూన్ 12వ తేదీనే.. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసి, పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తున్న మా ప్రభుత్వం పనితీరును , చూసి ఓర్వలేని వైకాపా నాయకులు పనికట్టుకొని పనిచేసే ప్రభుత్వం పై బురదజల్లడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారు పని చేయడం శుభపరిణామమన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టి నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తామన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ.