YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆమ్రపాలి పెళ్లికి గవర్నర్ కు ఆహ్వానం

ఆమ్రపాలి పెళ్లికి గవర్నర్ కు ఆహ్వానం

 రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆదివారం  వరంగల్‌ అర్బన్  జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కలిసి తన పెళ్లికి ఆహ్వానిం చారు. ఇది ఇలా ఉండగా  ఈ నెల 18న ఆమె సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్‌ వివాహ వేదికగా కానుంది. ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో ఆమ్రపాలి ఏడు అడుగులు వేయనున్నారు. అనంతరం వధువరులు ఆమ్రపాలి-సమీర్ తమ పెళ్లి విందును ఈ నెల 23న వరంగల్‌లోని అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో, 25వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. వరంగల్‌లో జరిగే విందుకు తన సన్నిహితులు, ప్రముఖులను ఆహ్వానిస్తుండగా, హైదరాబాద్‌ల జరిగే వివాహ విందుకు కూడా ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వాని స్తున్నారు.  ఈ విందుకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానపత్రికలు కూడా సిద్ధం చేసేశారు. ఇందులో భాగంగానే ఆమె గవర్నర్ దంపతులను కలిశారు.



వరంగల్ విందులో 'వారం' తికమక..
అయితే వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆమ్రపాలి-సమీర్‌ల వివాహ విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చు తప్పు దొర్లింది. ఆ ఆహ్వానపత్రికలో విందు తేదీ ఫిబ్రవరి 23 శుక్రవారానికి బదులుగా (ఫిబ్రవరి 23, ఆదివారం) అని తప్పుగా పడింది. ఆహ్వానపత్రికలు పంచే క్రమంలో అచ్చు (వారం తికమక) తప్పును గుర్తించి సరిచేసి శుక్రవారంగా స్టిక్కర్ వేసి అతిథులకు అందజేస్తున్నారట. కాగా, ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు నూతన వధువరులుగా భర్త సమీర్‌తో కలిసి కలెక్టర్ ఆమ్రపాలి హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నారు.

Related Posts