YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అసెంబ్లీలో జయలలిత నిలువెత్తు చిత్రపటం

 అసెంబ్లీలో జయలలిత  నిలువెత్తు చిత్రపటం

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీలో మంగళవారంనాడు ఆవిష్కరించారు.

 ఏడడుగుల ఈ చిత్రపటాన్ని స్పీకర్ పి.ధన్‌పాల్ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆవిష్కరించగా, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తదితరలు హాజరయ్యారు. 

అయితే జయ చిత్రపటం ఆవిష్కరించిన గంటకే డీఎంకే ఈ వ్యవహారాన్ని రచ్చకీడ్చింది. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు దోషిగా నిర్దారించిన జయలలిత ఫోటోను తక్షణం తొలిగించాల్సిందిగా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

Related Posts