YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఒంటరి పోరాటం చేసిన పుజారా.. భారత్ స్కోర్ 250/9..!!

ఒంటరి పోరాటం చేసిన పుజారా.. భారత్ స్కోర్  250/9..!!

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట లో కోహ్లీసేన తడబడింది. వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పుజారా ఒంటరి పోరాటంతో భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 250/9 వద్ద నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. వాళ్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.  కష్టాల్లో పడిన భారత్‌ను పుజారా ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. మరో ఎండ్‌ నుంచి సహకారం లభించకపోయినా.. ఒక్కొక్కరితో కీలక భాగస్వామ్యాలు నమోదు చేస్తూ క్రీజులో పాతుకుపోయి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ ఆడించాడు.

Related Posts