YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఏపీ సీఎంతో సమావేశానికి విజయవాడ చేరిన అంబానీ

ఏపీ సీఎంతో సమావేశానికి విజయవాడ చేరిన అంబానీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైనందుకు మంగవారం సాయంత్రం రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ చేరుకున్నారు. ఈ  సాయంత్రం  చంద్రబాబుతో అంబానీ భేటీ కానున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌‌తో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విజయవాడ పర్యటనలో భాగంగా బాబుతో ఆయన భేటీ అవుతున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన ఆర్టీజీ సెంటర్‌ను అంబానీ పరిశీలించనున్నారు. అనంతరం సీఎం నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గొనే అవకాశం ఉంది. 

ఇటీవల ముంబై పర్యటనలో భాగంగా ముకేష్ అంబానీని కలిసిన మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకుగల అవకాశాలు వివరించి రాష్ట్ర పర్యటనకు రావాలని ఆహ్వానించారు. దీనికి అనుగుణంగా అంబానీ.. సీఎంతో భేటీ కానున్నారు. వీరిమధ్య ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది.

Related Posts