YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూకట్‌పల్లి ప్రజలకు సుహాసిని బహిరంగ లేఖ..!!

కూకట్‌పల్లి ప్రజలకు సుహాసిని బహిరంగ లేఖ..!!

 కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి సుహాసిని కూకట్ పల్లి ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. 'కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ.. నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి, అక్కున చేర్చుకున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నన్ను ఆదరించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నేను (కూకట్‌పల్లి) ఇక్కడే ఉండి ప్రజలకి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను. ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా' అంటూ సుహాసిని తన లేఖలో తెలిపారు.

 

Related Posts