YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దక్షిణ భారతంలో పుంజుకున్న బీజేపీ

దక్షిణ భారతంలో పుంజుకున్న బీజేపీ

రంగారెడ్డి
గతంలో పార్లమెంటు ఎన్నికల కంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో కూడా బిజెపి బాగా పుంజుకుందని చేవెళ్ల పార్లమెంటు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లలో బిజెపి  ఎంపీ స్థానాలలో విజయం సాధిస్తారని కొండ అన్నారు.  ఎన్నికల ప్రచారం భాగంగా శేరిలింగంపల్లి లోని పలు ప్రాంతాలు పర్యటించిన  విశ్వేశ్వర్ రెడ్డి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బిజెపి అభ్యర్థుల గెలుపుకి దోహదపడతాయని చెప్పారు. చందానగర్ పీజే ఆర్ స్టేడియం. లింగపల్లి హుడా ట్రేడ్ సెంటర్ జీహెచ్ఎంసీ పార్కు, లక్ష్మి విహార్ కాలనీల్లో విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం చేశారు. సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే సౌత్ ఇండియాలో బిజెపి బలపడిందని దీంతో బిజెపికి 400పై చిలుకు ఎంపీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. తాను ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో  శేర్లింగంపల్లి పర్యటిస్తున్నప్పుడు అనేక కాలనీలో కనీసం వసతులలేని దృశ్య కలచివేశాయన్నారు. మోలిక సదుపాయాలు కల్పించడంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రధమంగా మౌలిక వసతులు కల్పనకే అధిక ప్రాథమిక ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related Posts