బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీయార్' బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఆడియోను ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తూ స్పెషల్ గా ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. రానా .. సుమంత్ .. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.