YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రెండో రోజు పెరిగిన బంగారం ధరలు

రెండో రోజు పెరిగిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి ట్రేడింగ్‌లో వెండి ధరలు బంగారం బాటలోనే పయనించాయి. అంతర్జాతీయంగా డిమాండ్ రావడం, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బులియన్ మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 21న) 10 గ్రాముల బంగారం ధర రూ. 230 పెరిగింది. దీంతో రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 32,000 నుంచి రూ. 32,230కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగాధరం ధర రూ. 32,080 అయింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. రూ.25,000 ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. స్థానికం వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర రూ.38వేల మార్కు చేరుకుంది. నేటి ట్రేడింగ్‌‌లో కిలో వెండి ధర 250 పెరిగి రూ.38,000కి చేరుకుంది. ఇక వారంతపు వెండి ధరలు 236 పెరిగి రూ.37,494కి చేరుకుంది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

Related Posts