YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

భార్య ఫ్రెండ్ ను తల్లిని చేసిన ప్రబుద్ధుడు

భార్య ఫ్రెండ్ ను తల్లిని చేసిన ప్రబుద్ధుడు

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. అపరిచితులే కాదు.. స్నేహితులు, బంధువుల నుంచి కూడా అతివలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఆమె స్నేహితురాలి భర్త చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురై బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్‌కు కవర్‌పేటకు చెందిన షర్మిలతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. వీరిద్దరూ కిలికోడి గ్రామంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలైన ఓ యువతి తరుచూ వారింటికి వచ్చేది. దీంతో సిలంబరసన్‌ ఆమెపై కన్నేశాడు. ఓ రోజు ఆ యువతి వచ్చిన సమయంలో షర్మిల ఇంట్లో లేదు. ఆమెను కూర్చోమని చెప్పిన సిలంబరసన్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చాడు. ఆ విషయం తెలియని యువతి డ్రింక్ తాగి అక్కడే పడిపోయింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి బెదిరిస్తూ తరుచూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన బాధితురాలు ఈ నెల 21న పొన్నేరి ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తన బతుకు నాశనం కావడానికి కారణమైన సిలంబరసన్‌పై గుమ్మిడిపూండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు  నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Related Posts