YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

 అమెరికాలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. టెన్నెసా రాష్ట్రం కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరగడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం బాధాకరం. మృతులు నేరడుగమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత నాయక్‌ దంపతుల పిల్లలు. వారి కుమార్తెలు సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్‌ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14) ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. చిన్నతనంలో దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక, క్రిస్మస్ సందర్భంగా ఇంటికి దీపాలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దీపాలంకరణ వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మృతుల్లో మరో వ్యక్తిని ఇంటి యజమానిగా గుర్తించారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలో కరీ అనే మహిళతో పాటు సాత్విక నాయక్‌, సుహాస్‌ నాయక్‌, జ్వాయ్‌ నాయిక్ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కరీ భర్త డానియెల్, కుమారుడు కోల్ ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. స్మోక్ అలారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Related Posts