YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బంగారు,వజ్రాభరణాల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కళ్యాణ్ జ్యూవెలర్స్ లో క్రిస్మస్ నూతన సంవస్సర వేడుకలు

బంగారు,వజ్రాభరణాల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి      కళ్యాణ్ జ్యూవెలర్స్ లో క్రిస్మస్ నూతన సంవస్సర వేడుకలు

భారతదేశంలో సుప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యూవెలర్స్ తన వరవడికి నాన్దిపలికింది. క్రిస్మస్ సీజన్ స్ఫూర్తిని సైతం కళ్యాణ్ జ్యూవెలర్స్ వేడుక చేస్తున్నట్లు కళ్యాణ్ జ్యూవెలర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ , శ్రీ టీ ఎస్ కళ్యాణ రామన్ తెలిపారు. బంగారం , వజ్రాభరణాల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిలను అందిస్తున్నమన్నారు. కళ్యాణ్ జ్యూవెలర్స్ షోరూమ్ లో వినియోగదారులు కొనుగోలు చేయడం ద్వారా ఉచిత బహుమతులను గెలుచోవచ్చునన్నారు. వీటిలో 50 వేల రూపాయల ఖరీదు కలిగిన బంగారం ఆభరణాలు లేదా 25 వేల రూపాయల కన్నా అధిక ధరల్లోని వజ్రాభరణాలను కొనుగోలు చేసి నఎడల హోమ్ అప్లయెన్సె స్, మొబైల్ ఫోన్లు పొందవచ్చునని తెలిపారు. కాకినాడలోని  జవహార్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూమ్ లో  క్రిస్మస్స్, నూతన సంవస్సర పురస్కరించుకొని వినూత్న డిజైన్లను అందుబాటులోకి తెచ్చింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా నూతన షోరూమ్ వృద్ది చేయబడిన షాపింగ్ అనుభవాలను, విస్తృతశ్రేణిలో అత్యున్నతంగా డిజైన్ చేసిన ఆభరణాలు, పారదర్శక ధరలు, ఖచ్చితమైన నాణ్యత, మహోన్నతమైన కస్టమర్ అనుభవాలతో అందిస్తున్నమన్నారు. వేడుకలలో భాగంగా అదనంగా ఆకర్షణీయమైన ప్యాకేజీలు, నూతన డిజైన్లు , వినియోగదారుల ప్రత్యేకవసరరాలు తీరేందుకు ప్రత్యేక ప్రయోజనాలను వృద్ధి చేయబడిన సేవింగ్స్ , షాపింగ్ అవకాశాలతో అందిస్తున్నామన్నారు. ఈ షోరూమ్ లో కళ్యాణ్ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన కలెక్షన్స్ లో రంగ్, - జెమ్ స్టోన్ జ్యూవెలరీ, ముద్ర - హ్యాండ్ క్రాఫ్ట్ డ్ జ్యూవెలరీ, అనోఖీ - అన్ కట్ డైమండ్స్ గ్లో - డ్యాన్సింగ్ డైమండ్స్ మరియు తేజస్వి - పోల్కీ జ్యూవెలరీ వంటివి ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ నూతన, విశాలవంతమైన షోరూమ్ ను ఇప్పుడు జవహార్ వీధీలో ఏర్పాటు చేశారు. గతంలో ఈ షోరూమ్ కాశీంవారి వీధిలో ఉండేది. నూతన ప్రాంతంలో తెరిచిన ఈ షోరూమ్ కు పెద్ద సంఖ్యలో కాకినాడ, చుట్టుపక్కల వాసులు రావడంతో పాటుగా విలాసంవతమైన డిజైన్లు, ఇంటీరియర్స్ ను ఆస్వాదిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ భారతదేశవ్యాప్తంగా 15 షోరూమ్ లను తెరిచారు. ఈ బ్రాండ్ ఇటీవలనే దేశవ్యాప్తంగా 100 షోరూమ్ ల మైలురాయిని అధికగమించింది. ఆంధ్రప్రదేశ్ లో కళ్యాణ్ జ్యూవెలర్స్ బ్రాండ్ 8 చోట్ల ఉనికిని చాటుతుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాలలో కాకినాడ ఒకటి.ఇక్కడ ఈ బ్రాండ్ కు గణనీయమైన సంఖ్యలో వినియోగదారులున్నారు. కాకినాడ ప్రజల నుంచి మాకు లభిస్తున్నమద్దుతు పట్ల సంతోషంగా ఉందన్నారు. 

Related Posts