YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

 లాభాల్లో ముగిసిన మార్కెట్లు

బుధవారం  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత ట్రేడింగ్‌ను నష్టాలతో ముగించిన మార్కెట్లు క్రిస్మస్ (డిసెంబరు 25) సెలవు అనంతర ట్రేడింగ్‌ను కూడా నష్టాలతోనే ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్.. ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే మరింత నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో ఏకంగా 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించింది. ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా సహా కీలక షేర్లలో అమ్మకాలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్ తీరుపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత మదపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు క్రమంగా నష్టాల్లోనుంచి లాభాల్లోకి పయనించాయి. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా షేర్లు లాభపడగా.. ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 179.79 పాయింట్ల లాభంతో 35649.94 వద్ద, నిఫ్టీ 66.35 పాయింట్ల లాభంతో 10729.85 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ షేర్లు స్వల్ప లాభాలతో (+0.06) గట్టెక్కగా.. మిడ్ క్యాప్ షేర్లు (-0.09) మేర నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా 3 పైసలు లాభపడి రూ.70.11 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అదానీ పోర్ట్స్ (+4.28), జీ ఎంటర్‌టైన్ (+4.19), భారతీ ఎయిర్‌టెల్ (+3.67), బజాజ్ ఫిన్‌సర్వ్ (+2.62), అల్ట్రాటెక్ సిమెంట్ (+2.02) షేర్లు అధిక లాభాలను ఆర్జించగా.. సన్ ఫార్మా (-2.52), యస్ బ్యాంక్ (-1.56), టీసీఎస్ (-1.53), టాటా మోటార్స్ (-0.93), ఓఎన్జీసీ (-0.88) షేర్లు ఎక్కువగా నష్టపోయాయి

Related Posts