YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘మోదీ దుస్తులు సొంత సొమ్ముతోనే కొంటున్నారు’

‘మోదీ దుస్తులు సొంత సొమ్ముతోనే కొంటున్నారు’

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత సొమ్ముతోనే దుస్తులను కొంటున్నారని వెల్లడైంది. సమాచార హక్కు ఉద్యమకారుడు రోహిత్ సబర్వాల్‌ ప్రధాన మంత్రుల దుస్తుల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను తెలియజేయాలని దరఖాస్తు చేశారు.దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందిస్తూ ఈ ప్రశ్న వ్యక్తిగత విభాగంలోకి వస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం తమ అధికారిక రికార్డులలో లేదని పేర్కొంది.సబర్వాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రుల దుస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సొమ్ము ఖర్చుపెడుతోందని చాలా మంది భావిస్తున్నారన్నారు. తాను చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు పీఎంఓ నుంచి వచ్చిన సమాధానాన్నిబట్టి ప్రధాన మంత్రుల దుస్తుల కోసం ప్రభుత్వం ఖర్చు చేయదని స్పష్టంగా వెల్లడైందని తెలిపారు.

Related Posts