YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మూడో రోజు పెరిగిన బంగారం ధరలు

మూడో రోజు పెరిగిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్‌లో ముచ్చటగా మూడోరోజు కూడా పసిడి పరుగులు పెట్టింది. దేశీయంగా రెండురోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం (జనవరి 3) మరింతగా పెరిగాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.335 పెరిగి రూ.32,835 కి చేరింది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి చూస్తే.. మూడురోజుల్లోనే బంగారం ధర రూ.565 పుంజుకుంది. పసిడి ధర జనవరి 1న రూ.200, జనవరి 2న రూ.30 మేర పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.350 పెరిగి రూ.39,700 కి చేరింది.  బంగారం ధర పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,835 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,685 కి చేరింది. ప్రభుత్వం సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.25,200 వద్ద కొనసాగుతోంది.  వెండి ధర రూ.350 పెరిగి రూ.39,700 కి చేరింది. మరోవైపు వారాంతపు ఆధారిత డెలివరీ వెండి ధర రూ.617 పెరిగి రూ.39,365 కి చేరుకుంది. వెండి నాణేల ధరలో ఎటువంటి మార్పులేదు. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.76,000 వద్ద, అమ్మకం ధర రూ.77,000 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

Related Posts