YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పిఎన్ బి ఘటనలో కొనసాగుతున్న ఈడీ దాడులు 

Highlights

రూ.5,674 కోట్ల ఆస్తులు స్వాధీనం

21 ప్రాంత్రాల్లో రూ.25 కోట్ల  వజ్రాలు, బంగారం స్వాధీనం

ఆదివారం కూడా సోదాలు 

పిఎన్ బి ఘటనలో కొనసాగుతున్న ఈడీ దాడులు 

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల రూపాయల మేరకు మోసగించి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దాడులు మూడోరోజైన శనివారంనాడు కూడా కొనసాగాయి. దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.25 కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాలు, బంగారం, విలువైన స్టోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

దీంతో ఇంతవరకూ దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.5,674 కోట్లకు చేరింది. షోరూంలు, స్టోర్స్ వద్ద స్టాక్ వాల్యూ ఆధారంగా ఆస్తుల విలువ లెక్కగడుతున్నట్టు ఈడీ తెలిపింది. కాగా, ఆదివారంనాడు కూడా దాడులు కొనసాగే అవకాశాలున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.

Related Posts