YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బ్యాంకులకు ఆర్బీఐ షాక్

బ్యాంకులకు ఆర్బీఐ షాక్

ముంబై, ఏప్రిల్ 26,
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా  ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై 1.12 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కేవైసీ కి సంబంధించిన నిబంధనలతో సహా సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సూచనలను పాటించనందుకు ఆర్బీఐ ఈ పెనాల్టీ ని విధించింది. ఆర్బీఐ జారీ చేసిన నిబంధనలలో నో యువర్ కస్టమర్ (కేవైసీ) నియమాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ప్రభుత్వ రంగ బ్యాంకుపై విచారణ జరిగిందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు ద్వారా ప్రభుత్వ ఖాతాలో కస్టమ్ డ్యూటీ జమ కాకపోవడంపై విచారణ జరిగింది. ఈ చర్య రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉందని తెలిపింది. ఇది కాకుండా, రాజ్‌కోట్ నాగ్రిక్ సహకారి బ్యాంక్‌పై సెంట్రల్ బ్యాంక్ రూ.12 లక్షల జరిమానా కూడా విధించింది. డిపాజిట్ల వడ్డీ రేటుపై సూచనలను పాటించనందుకు ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించింది. దీనితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హర్యానా స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చండీగఢ్‌పై 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. హౌసింగ్ ఫైనాన్స్‌పై ఆర్‌బిఐ సూచనలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించింది.కస్టమర్ ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రభుత్వ రంగ రుణదాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 36 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.18 ఏప్రిల్ 2022న జారీ చేసిన ఆర్డర్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 36 లక్షల రూపాయల ద్రవ్య జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అనధికారిక బ్యాంకింగ్ లావాదేవీలలో వినియోగదారుల రక్షణ- పరిమిత బాధ్యతపై నిర్దిష్ట సూచనలను పాటించనందుకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ విధించినట్లు రెగ్యులేటర్ తెలిపారు.

Related Posts