YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

నూతన భవనంలోకి బీజేపీ ప్రధాన కార్యాలయం

Highlights

అత్యాధునిక సదుపాయాలు నూతన భవనం

ఒకటిన్నర సంవత్సరాల్లోనే నిర్మించడం ఓ రికార్డు.

నూతన భవనంలోకి బీజేపీ ప్రధాన కార్యాలయం

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం నూతన భవనంలోకి ఆదివారం మారుతోంది. దీన్‌దయాళ్ మార్గ్‌లో నిర్మించిన ఐదు అంతస్థుల భవనాన్ని ఆదివారం ప్రారంభిస్తారు. ఈ భవనం బేస్‌మెంట్‌లో పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ సౌధంలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. దీనిని ఒకటిన్నర సంవత్సరాల్లోనే నిర్మించడం ఓ రికార్డు. నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీలను కలుపుతున్న రంజిత్ సింగ్ ఫ్లై ఓవర్ సమీపంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. దీనిలో భారీ సమావేశ మందిరం, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు వేర్వేరు గదులు, భారీ గ్రంథాలయం, వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్, పార్టీ అధికార ప్రతినిథులకు మీడియా రూమ్స్ ఉన్నాయి.

Related Posts