YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అవిశ్వాస తీర్మానం ఫై గట్టెక్కిన థెరెసా మే ప్రభుత్వం

అవిశ్వాస తీర్మానం ఫై గట్టెక్కిన థెరెసా మే ప్రభుత్వం

బ్రిటన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి థెరెసా మే ప్రభుత్వం గట్టెక్కింది. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి వైదొలగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్‌ తీర్మానాన్ని నిన్న దిగువ సభ తిరస్కరించిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 432 మంది, ఆమోదిస్తూ 202 మంది ఎంపీలు ఓటు వేశారు. ప్రధాని సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్స్‌కు చెందిన వందమందికిపైగా సభ్యులు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించారు.ఈ నేపథ్యంలో ఆ వెంటనే ప్రధాని థెరెసా మేపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్‌లో 19 ఓట్ల తేడాతో కన్జర్వేటివ్‌ ప్రభుత్వం గెలుపొందింది. దీంతో బ్రెగ్జిట్‌ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను ప్రధాని థెరెసా ఆహ్వానించారు. ఈ ఒప్పందంపై వేగంగా నిర్ణయానికి రావాలని కోరారు.

Related Posts