YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీ స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. రోజంతా రేంజ్‌బౌండ్‌లో కదలాడిన ఇండెక్స్‌లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 36,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ కేవలం 2 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 10,900 స్థాయిని రక్షించుకోగలిగింది. 890 షేర్లు లాభపడితే, 1,632 షేర్లు నష్టపోయాయి. ఇక 161 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదేసమయంలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, ఎల్అండ్‌టీ, హెచ్‌పీసీఎల్ షేర్లు టాప్ లూజర్లుగా ఉన్నాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. ఒక్క ఎనర్జీ విభాగం మాత్రం లాభాల్లో ఉంది. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్స్‌లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఫార్మా ఇండెక్స్ 3 శాతం మేర పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దాదాపు 5 శాతం మేర పరుగులు పెట్టింది. విప్రో 3 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో సన్ ఫార్మా 9 శాతం మేర పతనమైంది. ఈ షేరు ఇంట్రాడేలో 12 శాతానికి పైగా పడిపోయింది. భారతీ ఎయిర్‌టెల్ 6 శాతానికి పైగా క్షీణించింది. గెయిల్ 3 శాతానికి పైగా, హెచ్‌పీసీఎల్ 2 శాతానికి పైగా నష్టపోయాయి.

Related Posts