YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

సోమవారం హైదరాబాద్ రానున్న మోదీ

Highlights

  • వరల్డ్ కాంగ్రెస్ ఐటీ, నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ లను  ప్రారంభిస్తారు..?
  • త్వరలో ఏపీలో పర్యటించనున్న ప్రధాని
  •  పర్యటనపై స్పష్టత ఇవ్వని టీడీపీ, బీజేపీ నేతలు
సోమవారం హైదరాబాద్ రానున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ఏపీలో పర్యటించనున్నారని.. రాష్ట్ర ప్రజల్లో, ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి అగ్నిని చల్లార్చేలా ఏదో ఒక ప్రకటన చేస్తారని గత రెండు రోజులుగా వార్తలు పెద్దఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంత వరకూ నిజమనేది అటు టీడీపీ గానీ బీజేపీ నేతలు మోదీ పర్యటనపై స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా హైదరాబాద్ పర్యటనకు మోడీ వస్తున్నారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభం కానున్న రెండు కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ), నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్(ఎన్ఐఎల్ఎఫ్) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.

Related Posts