YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

మోడీజీ నోరుమెదపండి..

Highlights

  • నీరవ్ స్కామ్ పై స్పందించండి
  • ఆర్ధిక మంత్రి ఎక్కడా..?
  •  ట్విట్.చేసిన రాహుల్‌ గాంధీ
మోడీజీ నోరుమెదపండి..

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోడీ నోరుమెదపకపోవడాన్ని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. భారీ కుంభకోణానికి పాల్పడి, దేశం విడిచి వెళ్లడంపై ప్రధాని స్పందించాలన్నారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పుకున్న ప్రధాని ఎక్కడున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. నీరవ్‌ ఉదంతంపై గతంలోనూ మోదీ టార్గెట్‌గా రాహుల్‌ ట్వీట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. 
పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడంపై పిల్లలకు సూచనలు ఇచ్చేందుకు ప్రధాని రెండు గంటల సమయం కేటాయిస్తారు కానీ..రూ 22,000 కోట్ల బ్యాంకింగ్‌ స్కామ్‌పై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరని రాహుల్‌ అన్నారు. ఈ స్కాంపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడకుండా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. 

Related Posts