YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ప్రధాని మోదీ బసకు ఆ హోటల్‌ నో

Highlights

  • రెండు రోజుల పర్యటనకు మైసూర్ 
ప్రధాని మోదీ బసకు ఆ హోటల్‌ నో

భారత్ ప్రధాని తలుచుకుంటే తాను కోరుకున్న చోట ఉండవచ్చని అనుకుంటే పొరపాటే. ఈనెల 19,20 తేదీల్లో మైసూర్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భద్రతా సిబ్బంది బస కోసం అధికారులు ఓ హోటల్‌ను సంప్రదించగా వసతిని కల్పించేందుకు సదరు హోటల్‌ నిరాకరించింది.

ఓ వివాహ రిసెప్షన్‌ కోసం రూములన్నీ బుక్‌ అయ్యాయని, ప్రధానికి వసతి కల్పించలేమని హోటల్‌ లలితా మహల్‌ ప్యాలెస్‌ అధికారులకు తేల్చిచెప్పింది. ప్రధాని, ఆయన సిబ్బంది వసతి కోసం డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఓ అధికారి తమను సంప్రదించారని.

.అయితే ఓ వివాహ వేడుక కోసం రూమ్స్‌ అన్నీ బుక్‌ అవడంతో తాము ప్రధాని బృందానికి ఆశ్రయం కల్పించలేకపోయామని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ జోసెఫ్‌ మాథ్యూస్ చెప్పారు.

Related Posts