YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పెరుగుతున్న పసిడి ధరలు

పెరుగుతున్న పసిడి ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి మంగళవారం పెరిగింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.340 పెరుగుదలతో రూ.34,450 స్థాయికి చేరింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.130 తగ్గుదలతో రూ.41,530కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ ఎగయడం కారణంగా బంగారం ధర పెరిగిందని ట్రేడర్లు తెలిపారు. అయితే బలహీనమైన గ్లోబల్ ట్రెండ్ కారణంగా ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,312.2 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 15.83 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 పెరుగుదలతో రూ.34,450కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 పెరుగుదలతో రూ.34,300కు ఎగసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.26,100కు చేరింది. కేజీ వెండి ధర రూ.130 తగ్గుదలతో రూ.41,530లకు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.139 తగ్గుదలతో రూ.40,437కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద కొనసాగుతోంది. 
ఏపీ బులియన్ బోర్డు ప్రకారం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.34,390గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,810గా ఉంది. కేజీ వెండి ధర రూ.41,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,400గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,810గా ఉంది. కేజీ వెండి ధర రూ.43,700 వద్ద కొనసాగుతోంది. 

Related Posts