YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ తగ్గిన బంగారం

మళ్లీ తగ్గిన బంగారం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పసిడి మళ్లీ క్షీణించింది. బంగారం ధర బుధవారం కూడా తగ్గింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.34,050 స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయంగా ట్రెండ్ సానుకూలముగా ఉన్నా కూడా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడం కారణంగా బంగారం ధరలు తగ్గాయి.బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. కేజీ వెండి ధర రూ.200 తగ్గుదలతో రూ.40,800కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం ప్రతికూల ప్రభావం చూపింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,313.1 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 15.80 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.34,050కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో రూ.33,900కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Related Posts