YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శివాజీపై బీజేపీ దాడి..

Highlights

  • విజయవాడలో ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో చర్చ
  • బీజేపీని తూర్పారబట్టిన శివాజీ
  • సంయమనం కోల్పోయిన బీజేపీ కార్యకర్తలు
  • శివాజీపై దాడిని అడ్డుకున్న ప్రజాసంఘాలు
శివాజీపై బీజేపీ దాడి..

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చర్చలు సాగుతున్ననేపథ్యంలో బుధవారం జరిగిన చర్చ రచ్చకెక్కింది.  విజయవాడలో ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న సినీ నటుడు శివాజీపై దాడికి పాల్పడ్డారు. చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు. హోదా కోసం ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్న సందర్భంలో  అక్కడే ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తల్లో అసహనం పెరగడంతో ఈ ఘటనకు దారితీసింది. అసలు శివాజీ ఎం మాట్లాడారంటే.. బీజేపీ వైఖరిని తూర్పారబట్టాడు. "మోదీ జీరో... మోదీ జీరో" అంటూ శివాజీ నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు కల్పించుకుని "శివాజీ డౌన్ డౌన్" అని నినాదాలు చేశారు. శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై పడటంతో, అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మ వ్యాఖ్యానించడంతో ఆమెపైనా దాడి ప్రయత్నం జరిగింది.

Related Posts