YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రాకేష్ రెడ్డి కస్టడీ పోడిగింపు

రాకేష్ రెడ్డి కస్టడీ పోడిగింపు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ ను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శనివారం  హాజరుపరిచారు. నిందితులనుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, వారిని విచారించేందుకు మరింత సమయం కోవాలని కోర్టును కోరారు. మరో 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని విన్నవించారు. జయరాం కారు దొరికిన నందిగామకు వెళ్లి విచారించేందుకు, హత్య జరిగిన సీన్ ను రీ క్రియేట్ చేసేందుకు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్నారు.వాదనలు విన్న నాంపల్లి కోర్టు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను ఈ నెల 23 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ ఫిబ్రవరి 23 వరకు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు. అంతకుముందు వారిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Related Posts