YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాక్ కు అమెరికా వార్నింగ్

పాక్ కు అమెరికా వార్నింగ్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గురువారం పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని ఆగ్రదేశం అమెరికా ఖండించింది. ఈ సందర్బంగా పాకిస్థాన్ కు  తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రవాదులకు ఆశ్రయం, మద్దతు వెంటనే ఆపేయాలని సూచించింది.  లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  పాక్ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించరాదని కోరింది. 
ఉగ్రవాద నిర్మూలనకు భారత్-అమెరికాలు కలిసి పనిచేస్తాయమని వైట్ హౌజ్   మీడియా కార్యదర్శి సారా శాండర్స్ పేర్కొన్నారు.  ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.  ఉగ్రవాదం నిర్మూలనంలో భారత్ కు అమెరికా అండగా ఉంటుందన్నారు. కాగా, దాడి వెనక పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉండే అవకాశం ఉందని అమెరికా రక్షణ నిపుణులు అనుమానం వ్యక్తం చేపిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పౌరులెవరూ పాక్  పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Related Posts