YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ఫ్లాట్.. కోటక్ బ్యాంక్ డౌన్

మార్కెట్ ఫ్లాట్.. కోటక్ బ్యాంక్ డౌన్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్గా ట్రేడవుతోంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 35,898 పాయింట్లతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 35,906 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,790 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,783 వద్ద ట్రేడింగ్ ను ఆరంభించింది. 
అయితే సమయం గడిచేకొద్ది సెన్స్క్స్ కూడా నష్టాల్లోకి వెళ్లింది. సూచీల నష్టాలు స్వల్పంగా పెరిగాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్ 22 పాయింట్ల నష్టంతో 35,876 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 10,777 వద్ద ట్రేడవుతున్నాయి. 
నిఫ్టీ 50లో భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐఓసీ, హెచ్ పీసీఎల్, యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఇన్ ఫ్రాటెల్ 3 శాతం పెరిగింది. 
అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 4 శాతం పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం మేర నష్టపోయింది.  సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, మీడియా రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

Related Posts