YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అప్పులు తీర్చడానికి ఏకంగా దొంగ నోట్ల ముద్రణ

అప్పులు తీర్చడానికి ఏకంగా దొంగ నోట్ల ముద్రణ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఓ మహిళ కొత్త ఎత్తు వేసింది. ఇంట్లోనే దొంగనోట్లు ముద్రిస్తూ అప్పులు తీర్చాలని భావించింది. డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో  పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కేసు విచారణలో యూ ట్యూబ్లో వీడియోలు చూసి నోట్లు ముద్రిస్తున్నట్లు ఆమె చెప్పడంతో పోలీసులకే షాక్ తిన్నారు. తమిళనాడులోని  కడలూరు మరియప్పన్ నగర్కు చెందిన భరణికుమారికి ఆనంద్తో వివాహంకాగా.. ఇద్దరు పిల్లలు. భర్త ఆనంద్కు వ్యాపారంలో నష్టాలు రావడంతో.. ఆర్థికంగా కష్టాలు  వెంటాడుతున్నాయి. దీనికితోడు భరణికుమారి కూడా ఇరుగుపొరుగువారి దగ్గర అప్పులు చేసింది. ఆ అప్పు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో.. భరణి కుమారికి ఏం 
చేయాలో అర్థంకాలేదు. అప్పు ఎలాగైనా తీర్చాలని భావించిన ఆమెకు ఓ ఆలోచన తట్టింది. భరణి కుమారి యూట్యూబ్లో కొన్ని వీడియోలో చూసింది. దొంగనోట్లను ఎలా ముంద్రించాలో నేర్చుకుంది. వెంటనే ప్లాన్ను అమలరు పరిచింది. కలర్ ప్రింటర్ సాయంతో.. ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే రూ.2వేలు, 500, 200 నకిలీ నోట్లను  ముద్రించింది. ఆ నోట్లను కడలూరులో మారుస్తూ వచ్చింది. భరణికుమారి కడలూరులోని ఓ షాపులో ఫ్రూట్స్ కొనుగోలు చేసింది. రూ.200 చెల్లించాల్సి ఉండగా.. రూ.2వేల  నోటును ఇచ్చింది. భరణికుమారి ఇచ్చిన నోటు రంగు తేడాగా ఉండటంతో షాపులో కూర్చొన్న మహిళకు అనుమానం వచ్చింది. ఆమె తన భర్తకు నోటు చూపించగా 
దొంగనోటుగా తేలింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసుల రాకను గమనించిన భరణి సమీపంలోని బస్టాండ్కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సెక్కింది. ఆమె  కోసం గాలించి.. చివరికి బస్సులోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే నకిలీ నోట్ల ముద్రించినట్లు ఆమె ఒప్పుకుంది. కేసు నమోదు 
చేసిన పోలీసులు.. ఆమె ఇంటి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. 

Related Posts