YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

4 వరోజు లాభాలే

4 వరోజు లాభాలే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశీ స్టాక్ మార్కెట్ లాభాల ట్రెండ్ కొనసాగుతోంది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం కూడా లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 36,725 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11,058 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. ముడిచమురు ధరలు పతనం, రూపాయి ర్యాలీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం వంటి తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. నిఫ్టీ 50లో ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎల్అండ్‌టీ 2 శాతానికి పైగా పెరిగింది. ఎంఅండ్ఎం కూడా దాదాపు 2 శాతం లాభపడింది. అదేసమయంలో ఐఓసీ, కోల్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, విప్రో, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టపోయాయి. ఐఓసీ, కోల్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, విప్రో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయిసెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడింది. 

Related Posts