YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మిస్టరీగా మారిన ప్రీతిరెడ్డి

మిస్టరీగా మారిన ప్రీతిరెడ్డి

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన ప్రీతిరెడ్డి కేసు మిస్టరీగా మారింది. దీన్ని చేధించేందుకు ఆస్ట్రేలియా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రీతిరెడ్డిని హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్ కూడా చనిపోవడంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ 2013 నుంచి డేటింగ్లో ఉన్నారని, అయితే అతడి ప్రవర్తనతో విసిగిపోయిన ప్రీతి మూడు నెలల క్రితమే బ్రేకప్ చెప్పేసిందని ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు. తాను కొత్త బాయ్ఫ్రెండ్ ని ఎంతగా ఇష్టపడుతున్నానో తమకు మెసేజ్లు చేసేదని పోలీసులకు తెలిపారు. అయితే ప్రీతిరెడ్డి తనకు బ్రేకప్ చెప్పడం ఇష్టం లేని హర్షవర్ధన్.. ఆమెను వేధించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైండి. మార్చి 2న సెయింట్ లియోనార్డ్ లో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్ కు వస్తున్న ప్రీతిరెడ్డిని కలిసేందుకు హర్షవర్ధన్ టామ్ వర్త్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినట్లు గుర్తించారు. కాన్ఫరెన్స్ ముగిశాక ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారని విచారణలో వెల్లడైంది. మార్చి 3న ఉదయం ప్రీతిరెడ్డి తన కుటుంబసభ్యులకు ఫోన్ చేశారని, ఆ తర్వాతే ఆమె ఆచూకీ లభించకుండా పోయిందని గుర్తించారు. మార్చి 4న ప్రీతి కనిపించడం లేదంటూ హర్షవర్ధన్కు స్నేహితుడొకరు మెసేజ్ చేశారని, ఆమెకు కొంతసేపటి క్రితమే మాట్లాడానని, ఇప్పుడెక్కడుందో తెలీదని అతడు రిప్లై ఇచ్చినట్లు తెలిసింది. అయితే అప్పటికే హర్షవర్ధన్ ఆమెను హత్యచేసి ఉండొచ్చని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఏం మాట్లాడుకున్నారు?, ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న విషయాలు మిస్టరీగా మారాయి. అక్కడేం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో ఈ మిస్టరీని చేధించడానికి పోలీసులు తల పట్టుకుంటున్నారు.

Related Posts