YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్ వైఖరి మారితేనే...ఏదైనా

పాకిస్తాన్ వైఖరి మారితేనే...ఏదైనా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

ఒకవేళ కొత్త పాకిస్థాన్‌‌గా అవతరించాలని భావిస్తే ఉగ్రవాద సంస్థలపై తీసుకునే చర్యలు కొత్తగా ఉండాలని, ఈ విషయంలో ఆ దేశం కొత్తగా ఆలోచించాలని పాక్‌కు భారత్ సూచించింది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే భాగంలోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై వైమానిక దాడులు చేశామని, దేశ రక్షణ కోసం ఇలాంటి దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేశారు. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడిని నాన్-మిలటరీ చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్- 21తో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేశారని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలూ మన దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలను సంఘటనా స్థలం నుంచి సేకరించామని, ఎఫ్-16 యుద్ధ విమానంలో మాత్రమే వినియోగించగలిగే అమ్రామ్ క్షిపణులను లభించడమే దీనికి సాక్ష్యమని అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించామని రవీష్ కుమార్ వెల్లడించారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన దాడులను అడ్డుకునే క్రమంలో ఓ యుద్ధ విమానాన్ని కోల్పోయామని తెలిపారు. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చేశామని పాక్ చెబుతోంది. కానీ, దీనికి ఆధారాలను ఎందుకు చూపలేదని ఆయన ప్రశ్నించారు. పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిచిందని తెలియజేశారు. ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ ప్రకటించినా పాకిస్థాన్ దీన్ని ఖండించడం దురదృష్ట‌కరమని వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిస్తున్నాయని, ఈ విషయంలో పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకుని తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు. 

Related Posts