YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌కు షాకిచ్చిన టర్నర్..!!

సంచలన ఇన్నింగ్స్‌తో  భారత్‌కు షాకిచ్చిన టర్నర్..!!

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రెండు వరుస విజయాల తర్వాత గాడి తప్పిన టీమ్‌ఇండియా.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. ఆదివారం మొహాలిలో నాలుగో వన్డేలో భారత్‌.. 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్లు ధావన్‌ (143; 115 బంతుల్లో 18×4, 3×6), రోహిత్‌ (95; 92 బంతుల్లో 7×4, 2×6) మెరుపులతో మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో హ్యాండ్స్‌కాంబ్‌ (117; 105 బంతుల్లో 8×4, 3×6), ఖవాజా (91; 99 బంతుల్లో 7×4) పునాది వేయగా.. చివర్లో టర్నర్‌ (84 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 6×6) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆసీస్‌ 47.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిర్ణయాత్మక చివరి వన్డే బుధవారం దిల్లీలో జరుగుతుంది.

Related Posts