YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పబ్ జీతో తండ్రి అకౌంట్ లో 50 వేలు ఫట్

 పబ్ జీతో తండ్రి అకౌంట్ లో 50 వేలు ఫట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా పబ్‌జీ గేమ్‌కు బానిసలవుతున్నారు. కొందరు ఈ ఆటతో పరిసరాలను, కుటుంబాలను సైతం మరిచిపోతుంటే.. మరికొందరు పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పబ్‌జీ ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఆటకు బానిసలవుతున్న టీనేజర్లు హత్యలకు కూడా వెనకాడటం లేదంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు పబ్‌జీ గేమ్ కోసం దొంగగా మారాడు. తన తండ్రి అకౌంట్ నుంచి తెలివిగా రూ.50 వేలు మాయం చేసి పబ్‌జీకి సపోర్ట్ చేసే మొబైల్ కొనుగోలు చేశాడు. మిగతా సొమ్ముతో పబ్‌జీలో సైన్యం ధరించే దుస్తులు వగైరా కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలియని తండ్రి తన అకౌంట్లో రూ.50 నగదు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు అతని కొడుకుపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే, తన కొడుకు అలా చేయడని తండ్రి బుకాయించాడు. చివరికి నిజం తెలిసి షాకయ్యాడు. తన తండ్రి అకౌంట్ వివరాలను తెలుసుకున్న ఆ బాలుడు.. తన స్నేహితుడి పేటీఎం అకౌంట్‌లోకి డబ్బులను బదిలీ చేశాడు. ఈ సందర్భంగా తండ్రి మొబైల్‌కు వచ్చే ఓటీపీ మెసేజ్‌లను డిలీట్ చేశాడు. దీంతో ఆ లావాదేవీల వివరాలేవీ తండ్రికి తెలియలేదు. సైబర్ పోలీసుల విచారణంలో పేటీఎం అకౌంట్ వివరాలు తెలిశాయి. వాటి ఆధారంగా బాలుడి స్నేహితుడిని ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. చూశారుగా, పబ్‌జీ గేమ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో. ఇటీవల ఈ గేమ్‌పై ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల రాజ్‌కోట్ పోలీసులు నిషేదం విధించారు. ప్రస్తుతం ఈ గేమ్‌ను ఇండియాలో పూర్తిగా నిషేదించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది

Related Posts