YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మరింత తగ్గిన బంగారం ధరలు

మరింత తగ్గిన బంగారం ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కవరీ బాట పట్టినట్లు కనిపించిన పసిడి మళ్లీ పడిపోయింది. బంగారం ధర మంగళవారం తగ్గింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణం. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరుగుదలతో రూ.39,580కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 1,296.25 డాలర్లకు ఎగసింది. వెండి ధర ఔన్స్‌కు 1.03 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,150కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.32,980కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.50 పెరుగుదలతో రూ.39,580కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.55 క్షీణతతో రూ.38,660కు తగ్గింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,130కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,600కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.41,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది

Related Posts