YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

2 వేల కోట్ల గ్యాంగ్ స్టర్

 2 వేల కోట్ల గ్యాంగ్ స్టర్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయిమ్ ఆస్తుల విలువ ఏకంగా రూ. రెండు వేల కోట్లు. ఈ విషయాన్ని నయిమ్ కేసును విచారిస్తున్న సిట్ ప్రకటించింది. అతనిఆస్తుల్లో 1,019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. తెంలగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవాతో పాటు ముంబాయిలో ఉన్న ఇళ్లు, స్థలాలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన విధి విదానాలపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. నరుూమ్‌కు సంబంధించిన అస్తులు ప్రస్తు తం కోర్టు ఆధీనంలో ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ నరుూమ్‌కు సంబంధించి మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. కేసు దర్యాప్తును సిట్ మరో రెండు మాసాల్లో ముగించే అవకాశాలున్నాయి.హైదరాబాద్‌లోని అల్కాపురి కాలనీలో రెండు ఖరీదైన ఇళ్ల విలువ రూ. 6 కోట్లు ఉన్నట్లు సిట్ విచారణలో తేలింది. అలాగే మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ రూ.5 కోట్ల మేర ఉండొచ్చని సిట్ అంచానా వేసింది. షాద్‌నగర్‌లో 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్ విలువ దాదాపు రూ. 25 కోట్లు, తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ రూ. 35 కోట్లు, కరీంనగర్ శివారులోని సగునూర్‌లో రూ. 5 కోట వెంచర్, నల్గొండలో నయీమ్ అనుచరుల పేరిట రెండు ఇళ్లు, 18 ఎకరాల సాగుభూమి వివుల రూ. 4 కోట్లు, మిర్యాల గూడ నయీమ్ అత్త పేరిట ఉన్న 4 ఎకరాల భూమి ఖరీదు రూ.65 లక్షలు, భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180కి పైగా ఓపెన్ ప్లాట్స్ విలువ రూ.12 కోట్లు, గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇళ్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య సిట్ విచారణలో వెల్లడించింది.అదేవిధంగా నాగోల్, సరూర్‌నగర్‌లో నయీమ్ అనుచరులైన శ్రీధర్,శేషన్నల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాల్స్ విలువ రూ. 6కోట్లకు పైగానే ఉన్నట్లు తేలింది. నార్సింగ్, శంషాబాద్, కల్వకుర్తి, మేడ్చల్, శామీర్‌పేట్‌లలో ఇళ్లు, 11 ఎకరాల భూమి, రిసార్ట్ విలువ దాదాపు రూ. 33 కోట్ల వరకు ఉన్నట్లు సిట్ తేల్చిచెప్పింది. అలాగే మోయినాబాద్, అజీజ్‌నగర్, ఛత్తీస్‌గడ్, రాయపూర్‌లలో రూ. 6 కోట్ల మేర ఆస్తులున్నట్లు తేలింది. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం సిట్ విచారణలో 210మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో కేవలం 46 కేసులలో ఆధారాలు లభ్యమయ్యాయని సిట్ వివరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమౌతోంది. ఇదిలావుండగా నయీమ్ జరిపిన సెటిల్‌మెంట్స్ సంపాదించినభూములు చేతులు మారడంతో సిట్ దర్యాప్తుకు కొంత ఇబ్బంది కలుగుతోంది. అయినప్పటికీ కేవలం రెండు, మూడు నెలల్లో నయీమ్ అక్రమార్జన కేసును పూర్తి చేస్తామని సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts