YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 ఆథ్యాత్మిక గురువు శివైక్యం పట్ల దిగ్ర్భాంతి 

Highlights

  •  పరమపదించిన జయేంద్ర సరస్వతి
  • విచారం వ్యక్తం చేసిన మోదీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్
  • కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటూ ట్వీట్స్
 ఆథ్యాత్మిక గురువు శివైక్యం పట్ల దిగ్ర్భాంతి 

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం  ఉదయం పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సమాజం కోసం జయేంద్ర సరస్వతి ఎంతో చేశారని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. పేద ప్రజల జీవితాలను మార్చడం కోసం ఎన్నో సంస్థలను నెలకొల్పారని చెప్పారు. ఆయన మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ... లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.

యేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల  గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

జయేంద్ర సరస్వతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రముఖ ఆథ్యాత్మిక గురువు జయేంద్ర సరస్వతి మృతి విచారకరమని ఏపీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఆవేదన వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి, విద్యావికాసానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

జీవితంలో ధార్మికత, ఆథ్యాత్మిక చింతన, అత్యున్నత విలువలను ఆచరించి, ఇతరులకు ప్రబోధించారంటూ జయేంద్ర సరస్వతిని వైసీపీ అధినేత , ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్  జగన్మోహన్ రెడ్డి గుర్తు చేేసుకున్నారు. ఆయన శివైక్యం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. జగద్గురువుగా ఆయన ఖ్యాతి పొందారని చెప్పారు. జయేంద్ర సరస్వతి సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.

Related Posts