YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం.. టోర్నీ నుంచి హైద్రాబాద్ ఔట్

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం.. టోర్నీ నుంచి హైద్రాబాద్ ఔట్

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:    అద్భుత ఆట తీరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌కు చేరువగా వచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఆ జట్టు ఎలిమినేటర్‌లోనూ అదే ఆటతీరు కనబరిచింది. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. గప్టిల్‌ (19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 36), మనీష్‌ పాండే (36 బంతుల్లో 3 ఫోర్లతో 30), కేన్‌ విలియమ్సన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లతో 28), విజయ్‌ శంకర్‌ (11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) మాత్రమే రాణించారు. ఇషాంత్‌ శర్మ రెండు, కీమో పాల్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 165/8తో విజయం అందుకుంది. ఓపెనర్‌ పృథ్వీ షా (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్‌ సెంచరీ చేయగా.. పంత్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ధవన్‌ (16 బంతుల్లో 3 ఫోర్లతో 17) పర్లేదనిపించాడు. భువనేశ్వర్‌, ఖలీల్‌, రషీద్‌ ఖాన్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. పంత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. శుక్రవారం ఇక్కడే జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో చెన్నైతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకుంటుంది.

Related Posts