YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

భర్త ను చంపేందుకు ప్లాన్

 భర్త ను చంపేందుకు ప్లాన్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను చంపేందుకు ప్లాన్ చేసిందో ఇల్లాలు. భర్తను హత్య చేయించేందుకు రౌడీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది. డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో ప్లాన్ రివర్సై పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జరిగిన ఈ కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఈ మర్డర్ ప్లాన్‌లో ట్విస్ట్‌లు తెలిసి పోలీసులకే దిమ్మ తిరిగింది.రామకుప్పంకు చెందిన నాగరాజు ఓ ఎరువుల షాపులో పనిచేస్తూ.. భార్య సౌమ్య, ఇద్దరు పిల్లలతో కలిసి శాంతినగర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్య సౌమ్య జనార్థన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త నాగరాజు ఆమెను మందలించాడు. తర్వాత కూడా ఆమె పద్దతి మార్చుకోకపోగా.. భర్త తనకు అడ్డుగా ఉన్నాడని భావించింది. నాగరాజును ఎలాగైనా హతమార్చాలని సౌమ్య ప్లాన్ చేసింది. సౌమ్య భర్తను చంపించేందుకు పుంగనూరుకు చెందిన యువకులతో ఒప్పందం చేసుకుంది. రూ.లక్ష రూపాయాలు సుపారీ ఇస్తానని చెప్పి.. రూ.20వేల 
అడ్వాన్స్ చెల్లించింది. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ నాగరాజును హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఎరువుల షాపులో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. రాజంపేట రోడ్డు నుంచి ఓ బైక్‌పై ముగ్గురు 
యువకులు వెంబండించారు. కొద్ది దూరం రాగానే నాగరాజు బైక్‌ను కాలితో తన్నడంతో కిందపడిపోయాడు. నాగరాజు కిందపడిపోయిన వెంటనే మరో బైక్‌పై ముగ్గురు యువకులు వచ్చారు. ఆరుగురు కలిసి నాగరాజును పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లారు. కత్తి, బ్లేడుతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు పెద్ద కేకలు వేయడంతో.. రోడ్డుపై వెళుతున్న స్థానికులు గమనించారు. వారిని చూసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత స్థానికులు నాగరాజును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. భార్య సౌమ్య భర్తను చంపించేందుకు సుపారీ ఇచ్చినట్లు తెలిసి షాక్ తిన్నారు. నాగరాజుపై దాడి చేసిన యువకుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా.. మిగిలినవారు పరారీలో ఉన్నారు. ఈ కేసులో సౌమ్య ప్రియుడు జనార్థన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు నాగరాజు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 

Related Posts