YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఈ నెల 3న బిజెపి నేతల సమావేశం

Highlights

  • విశాఖలో ఈనెల 3న బీజేపీ నేతలు సమావేశం
  • ఏపీకి సంబంధించి కీలక నిర్ణయాలు
  • ఢిల్లీ నుంచి బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సతీష్జీ రాక
విశాఖలో ఈ నెల 3న బిజెపి నేతల సమావేశం

విశాఖలో ఈనెల 3న బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఏపీకి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ సతీష్జీ రానున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఏపీలోని ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు, విభజన చట్టం హామీలు, టీడీపీ వైఖరి, కేంద్రం చేసిన సాయంపై చర్చిస్తారు.

ఇటీవల రాయలసీమ  కర్నూలులో డిక్లరేషన్ పేరుతో బీజేపీ నేతలు కొన్ని తీర్మానాలు చేశారు. రాయలసీమలో రెండో రాజధాని,గవర్నర్ తాత్కాలిక విడిది, హైకోర్టు, సీఎం నివాసం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రాయలసీమలో 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు చేయాలనీ, రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.20వేల కోట్లు, చేతి వృత్తిదారులకు 5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

Related Posts