YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

హామీపై టీడీపీ లేఖల ఉద్యమం

Highlights

  • జాతీయ స్థాయిలో పోరాటం
  • అన్ని పార్టీలకు లేఖలు
  • టీడీపీ పార్లమెంటరీ పార్టీ  నిర్ణయం
హామీపై టీడీపీ లేఖల ఉద్యమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు అధికార తెలుగు దేశం పార్టీ సంనర్ధమైంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి వివరిస్తూ దేశంలోని వివిధ పార్టీలకు లేఖలు రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు, ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రస్తుత ప్రధాని ఇచ్చిన హామీలు తదితర అంశాలన్నింటినీ లేఖలో పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. 

Related Posts