
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేఏ పాల్ అమెరికా పంపిస్తానంటూ తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ సత్యవతి అనే మహిళ కేఏ పాల్ పై ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన వ్యాపార వేత్త సత్యవతి అనే మహిళను అమెరికా పంపిస్తానంటూ రెండు లక్షల రూపాయల చెక్ ను కూడా తీసుకున్నట్లు తెలిపింది. చెక్ తీసుకున్న తర్వాత తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారంటూ పోలీసులకు ఆధారాలు చూపించింది. కేఏ పాల్ పై సత్యవతి ఆరోపణలు ఇలా ఉన్నాయి. వీసా కోసం రెండు లక్షలు తీసుకున్న కేఏ పాల్ తనను అమెరికా పంపించడం లేదని ఆమె వాపోయింది. రూ.రెండు లక్షల రూపాయలు చెక్ ను
క్యాష్ చేసుకున్నంత వరకు కేఏ పాల్ వ్యాపారవేత్త సత్యవతితో మాట్లాడిన కేఏ పాల్ డ్రా చేసుకున్న అనంతరం ఆమె నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు.
చివరికి కేఏ పాల్ ను పట్టుకున్న ఆమె తనను అమెరికా ఎందుకు పంపించడం లేదని నిలదీసింది. తనకు ఐదు లక్షలు ఇస్తే వీసా ఇప్పిస్తానని లేకపోతే అంతేనని చెప్పుకొచ్చారు. అయితే బ్రతిమిలాడితే రూ.2లక్షలకు ఒప్పందం కుదిరిందని సత్యవతి తెలిపారు.