YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రుద్రారం ముంబై హైవేపై మహమూద్‌ అనే వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా నరికి చంపారు. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఐదు నెలలక్రితం లక్డారంలో జరిగిన హత్యకేసులో మహమూద్‌ నిందితుడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరినట్లు 
తెలుస్తోంది. 

Related Posts