YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

14వ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అమ్మ

Highlights

  • పెద్ద కొడుకు వయసు 24 ఏళ్లు
  • విషమ పరిస్థితిలో ఆ తల్లి
     
14వ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అమ్మ

మధ్యప్రదేశ్ బేగంగంజ్ జిల్లాలోని వీర్పూర్‌కు చెందిన 35 ఏళ్ల శారదా ప్రజాపతి 14వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె గర్భసంచి బలహీనంగా ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే చికిత్స అందించి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ శిశువు 4 కిలోల బరువు ఉన్నాడని వైద్యులు చెప్పారు. గర్భాశయంలో తీవ్ర రక్తస్రావం అవడంతో శారద పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.చిన్న వయసులోనే పెళ్లయిన ఆమె ఇప్ప‌టికే 13 మంది పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆమె పెద్ద కొడుకు వయసు 24 ఏళ్లు.

తాజాగా ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆమె పెద్ద కుమారుడే  మరొకరితో కలిసి శారదను బుదేల్‌ఖండ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య చేయిస్తున్నాడు.

Related Posts