YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ట్రిపుల్ ఐటీ’లో ప్రవేశం ఇలా..

Highlights

  •  ఈ సూచనలు పాటిస్తే చాలు 
ట్రిపుల్ ఐటీ’లో ప్రవేశం ఇలా..

పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాసర ట్రిపుల్‌ ఐటీ 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశా లకు నోటిఫికేషన్‌ విడుదలైంది.
తెలంగాణలో ఉన్న ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ)లో వెయ్యి సీట్ల భర్తీకి మంగళ వారం యూనివర్సీటి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
28వ తేది నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫలితాలకు సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబరుతో దరఖాస్తులు చేసుకోవచ్చు.
యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి మార్కుల జాబితాను తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.
 ప్రవేశ అర్హతలు..
 2017 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
 ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి.
రిజర్వేషన్లు...
ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గాను 85 శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించనున్నారు.
మిగతా 15 శాతం సీట్లు ఓపెన్‌ కెటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
 రిజర్వేషన్‌ ప్రకారం పరిశీ లిస్తే ఎస్సీకి 15,
 ఎస్టీ 6,
 బీసీ-ఏ 7,
 బీసీ- బి-10,
 బీసీ-సీ 1,
 బీసీ-డీ 7,
 బీసీ-ఈ 4,
 ఫిజికల్లీ హ్యండిక్యాప్‌-3,
 క్యాప్‌ 2,
 ఎన్‌సీసీ ఒకటి,
స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.
 దీంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు,
 ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.
 అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు.
▪ ప్రవేశ విధానం..
 పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
 ప్రభుత్వం, నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 0.4 పాయింట్లను వచ్చిన పదో తరగతి గ్రేడుకు జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
 సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన గ్రేడు పాయింట్లు ఉన్నట్లయితే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
అయినా సమానమైతే పుట్టిన తేది ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం...
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
 మీసేవా, పీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150,
ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 ప్రవేశరు సుము చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లిం చాలి.
 దీంతో పాటు ఆ సెంటర్‌ సర్వీస్‌ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు.
ముఖ్యమైన తేదిలు..
 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది 28-04-2017
చివరి తేది 24-05-2017
 దరఖాస్తు దారులు తమ సర్టిఫికేట్‌లను యూనివర్సీటికి పంపించాల్సిన ఆఖరు తేది : 29-05.2017
విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల జూన్‌ 5.
మొదటి కౌన్సెలింగ్‌ జూన్‌ 19, 20 తేదిల్లో
ప్రత్యేక కెటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ జూన్‌ 22, 24, 27 తేదిల్లో
చివరి దశ కౌన్సెలింగ్‌ జూన్‌ 29, 30 తేదిల్లో.
కొత్త విద్యార్థులకు జూలై 1వ తేది నుంచి తరగతులు ప్రారంభం.
ఫీజుల వివరాలు...
 ప్రవేశం పొందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో 6 సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.
ఇందులో ఇంజనీరింగ్‌ సంబంధించిన అన్ని కోర్సులు ఉంటాయి.
మొదటి రెండేళ్లు ఏడాదికి రూ. 36 వేలు,
ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రం మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇలాంటి వారికి యూనివర్సిటీ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించనుంది.
అన్ని ఉచితమే...
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని ఉచితంగా అందజేస్తుంది.
ఆరు సంవత్సరాల పాటు ల్యాప్‌టాప్‌, మూడుజతల డ్రెస్సులు, రెండు జతల షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది.
దీంతో పాటు కార్పొరేట్‌ స్థాయి కంటే ఎక్కువ వసతులను కల్పిస్తుంది.
కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాల న్నింటిలో దగ్గరుంచుకోవాలి.
దరఖాస్తు చే సుకున్న రశీదు, టెన్త్‌ హల్‌టికెట్‌,మార్కుల షీట్‌, రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌, కులద్రువీక రణ పత్రాలు.

Related Posts