YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశీ స్టాక్‌మార్కెట్ గురువారం కూడా లాభాల్లో ముగిసింది. మార్కెట్ లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 11,950 స్థాయి సమీపంలోకి వెళ్లింది. సెన్సెక్స్ 39,900 మార్క్‌పైకి చేరింది. చివరకు సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంతో 39,908 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,947 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ల ర్యాలీ మార్కెట్‌లకు కలిసొచ్చింది.
మార్కెట్ హైలైట్స్..
✺ నిఫ్టీ 50లో యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యూపీఎల్ దాదాపు 7 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో యస్ బ్యాంక్, టైటాన్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 3 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 1.28 శాతం ర్యాలీ చేసింది. మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పడిపోయింది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.02 శాతం తగ్గుదలతో 63.80 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.37 శాతం క్షీణతతో 57.12 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. దాదాపు 32 పైసలు లాభంతో 68.58 వద్ద కొనసాగుతోంది.

Related Posts