YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పైపైకి పసడి

మళ్లీ పైపైకి పసడి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర మళ్లీ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.35,800కు ఎగసింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగానే పెరిగింది. రూ.10 పెరుగుదలతో రూ.32,820కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర దాదాపు కేవలం రూ.5 పెరిగింది. దీంతో ధర రూ.40,580 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.10 పెరుగుదలతో రూ.34,710కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.33,510కు ఎగసింది. మరోవైపు కేజీ వెండి ధర స్వల్పంగా రూ.5 పెరిగింది. దీంతో ధర రూ.40,580కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర మళ్లీ పరుగులు పెట్టింది. ఔన్స్ పసిడి ధర 0.21 శాతం పెరుగుదలతో 1,403.40 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 15.05 డాలర్లకు చేరింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts